హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. అంబులెన్సులు, అత్యవసర సేవలు, ప్రముఖుల వాహనాల కోసం ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. వాహనాలు సిగ్నల్ సమీపించగానే ఆటోమేటిక్గా గ్రీన్ సిగ్నల్ పడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నూతన విధానంతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, అత్యవసర సేవలు సకాలంలో అందుతాయని భావిస్తున్నారు.