గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవడంతో ప్రభుత్వం ఇసుకను తక్కువ ధరకు అందించడానికి ‘ఇసుక బజార్’లను ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి అబ్దుల్లాపూర్ మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిభట్లలో నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించారు. త్వరలో శామీర్పేట్, ఘట్కేసర్ ప్రాంతాల్లో కూడా ఇసుక బజార్లను ఏర్పాటు చేస్తామని టీజీఎండీసీ అధికారులు తెలిపారు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలను నియంత్రించడానికి.. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకు ఇసుకను అందించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు.