హైదరాబాద్లోని మధురానగర్ కమాన్గల్లీలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో సోనూ బాయ్ (40) అనే మహిళ మరణించగా, ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. ఎల్పీజీ వినియోగంలో నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గ్యాస్ లీకేజీ వాసన వస్తే.. వెంటనే తలుపులు, కిటికీలు తెరిచి, గాలి ప్రసరించేలా చూడాలి. విద్యుత్ స్విచ్లను అస్సలు ముట్టుకోకూడదు. వంట పూర్తయిన వెంటనే సిలిండర్పై ఉన్న రెగ్యులేటర్ను తప్పకుండా ఆఫ్ చేయాలి. భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.