రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) అత్తాపూర్లో జరిపిన దాడిలో అక్రమ జింక మాంసం వ్యాపారాన్ని ఛేదించింది. వన్యప్రాణుల చట్టాలను ఉల్లంఘించి వేట మాంసం అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసింది. సులేమాన్ నగర్ నివాసి అయిన నిందితుడు మహ్మద్ ఇర్ఫానుద్దీన్ అక్రమంగా జింక మాంసాన్ని విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి రూ.3,000తో పాటు 15 కిలోల జింక మాంసం స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు అటవీ ప్రాంతంలో జింకను వేటాడి.. ఆ మాంసాన్ని నగరానికి రవాణా చేసి.. సులేమాన్ నగర్లో విక్రయిస్తున్నట్లు తేలింది.