హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త టన్నెల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఐటీ కారిడార్లలో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. హైదరాబాద్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో పాల్గొన్న ఆయన.. నగరంలో క్వాంటం కంప్యూటింగ్ కోసం ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుతో పాటు, రాబోయే రోజుల్లో హైదరాబాద్ను దేశంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్గా, ఏఐ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.