తెలంగాణలో పండగ వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఇష్టపడే పండుగ గణేష్ ఉత్సవం. అయితే గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను బట్టి.. పలు మార్గాల్లో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ పేర్కొన్నారు.