హైదరాబాద్లో అతి తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్లు అంటే జనం ఎగబడి కొన్నారు. రూ.35 వేలకే 90 గజాల స్థలం విక్రయిస్తుండటంతో వేల మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. తీరా అది ప్రభుత్వ భూమి అని, కొందరు కేటుగాళ్లు కబ్జా చేసి అక్రమంగా విక్రయించారని తెలిసి లబోదిబోమంటున్నారు.