హైదరాబాద్లో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని, ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు టెక్నాలజీ వాడకం వల్ల నేరాలు తగ్గాయని సీపీ సజ్జనార్ తెలిపారు. 2025 వార్షిక నివేదిక ప్రకారం.. మొత్తం నేరాలు 15% తగ్గగా, సైబర్ నేరాలు 8% తగ్గాయి. పోక్సో, గృహ హింస కేసులు పెరిగినా, బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని వివరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేస్తామని, ట్రాఫిక్ సమస్యకు AI పరిష్కారం చూపుతామని తెలిపారు.