తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 7,360 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గోదావరి తాగునీటి పథకం (రెండవ, మూడవ దశ) పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు.. ఇందులో 2.5 టీఎంసీలు మూసీ నది పునరుజ్జీవనానికి.. 17.5 టీఎంసీలు హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు కేటాయించారు. అలాగే.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) తాగునీటి సరఫరా పథకం (రెండో దశ)ను కూడా ప్రారంభిస్తారు.