నగరంలో హై సెక్యూరిటీ నడుమ మరో నకిలీ అధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శశికాంత్ అనే వ్యక్తి తాను ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారి అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడికి లైసెన్స్డ్ ఆయుధాలతో కూడిన ఇద్దరు బాడీగార్డ్లు.. సైరన్ అమర్చిన కారు, వాకీ టాకీలు కూడా ఉన్నాయి. నకిలీ ఐడీ కార్డులతో పాటు టీఎస్ఐఐసీకి చెందిన ఫోర్జరీ లెటర్లను కూడా ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ అధికారులమని చెప్పి ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే అలర్ట్ ఉండాలని పోలీసులు తెలిపారు.