హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న నలుగురు రోహింగ్యాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఫేక్ ఆధార్ కార్డులు సహా పలు నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 2011 నుంచి అక్రమంగా నివసిస్తున్న మహమ్మద్ అర్మాన్, అతని భార్య రుమానా, సోదరుడు నయీం, మదర్సా టీచర్ హారిస్లు అరెస్ట్ అయ్యారు. ఫేక్ పత్రాలు సమకూర్చిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ఘటనతో రోహింగ్యాల అక్రమ నివాసంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.