ప్రభుత్వ భూములు, చెరువులు, పేదల స్థలాలు ఆక్రమించే వారిపై హైడ్రా ఇకపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఇసుక అక్రమ రవాణా, నిర్మాణ వ్యర్థాలు వేసే వారిని జైలుకు పంపేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే వందల ఎకరాల భూమిని హైడ్రా పరిరక్షించిందని.. ఆక్రమణదారులను కఠినంగా శిక్షిస్తామని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.