Hyderabad Bonalu Festival 2025: కొద్ది రోజుల్లో ఆషాఢమాసం రాబోతోంది. హైదరాబాద్లో బోనాల సందడి మొదలవుతుంది. ఈసారి బోనాల కోసం రేవంత్ సర్కార్ మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. బోనాల కోసం ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసింది. అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేయమని కోరతామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గోల్కొండలో తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమై, జంట నగరాల్లోని 28 ఆలయాల్లో వైభవంగా జరుగుతాయి.