తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతుంది. గత రెండ్రోజుల క్రితం వర్షాలు కురిసి వాతావరణం చల్లబడగా.. భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. హైదరాబాద్ నగరంలో అయితే ఉదయం 10 తర్వాత రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రతకు అద్దం పట్టే ఘటన జగద్గిరిగుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మండుతున్న ఎండలతో ఓ బైకు పూర్తిగా దగ్ధమైంది.