హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతే కాకుండా.. ఈ వర్షం కారణంగా చార్మినార్ వద్ద పెచ్చులు ఊడిపడ్డాయి. అక్కడే ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. ఖైరతాబాద్లో మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా భయటపడ్డారు.