హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలంలో హైదరాబాద్లో స్థలాలు కళ్లు చెదిరే ధర పలికాయి. తాజాగా 14 ప్లాట్లను వేలం వేయగా.. ఏకంగా రూ.34.27 లక్షల ఆదాయం లభించింది. గచ్చిబౌలిలో అత్యధికంగా చదరపు గజం రూ.1.76 లక్షలు పలికి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కూకట్పల్లి, భౌరంపేట్, బాలాజీ నగర్, చింతల్ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో 14 స్థలాలకు వేలం నిర్వహించారు.