హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మరో కొత్త సైబర్ మోసం గురించి.. సీపీ సజ్జనార్ ప్రజలను అలర్ట్ చేశారు. వాటర్ బోర్డు బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటూ సైబర్ నేరగాళ్లు హెచ్చరికలు చేస్తున్నారని.. అలాంటి కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవలి కాలంలో ఏపీకే ఫైల్స్ పంపించి.. వారి ఖాతాల్లో నుంచి డబ్బులు కాజేస్తున్న ఘటనలు పెరుగుతుండటంతో.. హైదరాబాద్ వాసులు అలర్ట్గా ఉండాలని సీపీ సజ్జనార్ హితవు పలికారు.