హైదరాబాద్లో ఆదివారం వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. చార్మినార్ వద్ద 17 మంది మృతి చెందగా.. మైలార్దేవ్పల్లిలో మరో ప్రమాదంలో 53 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మూడంతస్తుల భవనంలో చిక్కుకున్న వారిని లాడర్లు, మెట్ల మార్గం ద్వారా సురక్షితంగా కాపాడారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.