హైదరాబాద్‌లో మరో భారీ బస్‌ టెర్మినల్‌.. ఈ ఏరియాలోనే, 7.22 ఎకరాలు గుర్తింపు

11 months ago 28
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఆర్టీసీ మరో భారీ బస్‌ టెర్మినల్‌ను ప్రతిపాదించింది. మహబూబ్‌నగర్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల వైపు నుండి వచ్చే రాష్ట్ర, అంతర్రాష్ట్ర బస్సుల కోసం ఆరాంఘర్‌లో 7.22 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ప్రస్తుత ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లలో రద్దీని తగ్గించడం, ప్రయాణికులకు సమయం ఆదా చేయడం ఈ టెర్మినల్ ముఖ్య ఉద్దేశం. భూకేటాయింపు ప్రతిపాదన ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టరేట్‌లో పెండింగ్‌లో ఉంది. త్వరలో దీనికి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది.
Read Entire Article