తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో 1000 ఎకరాల్లో ప్రత్యేకంగా ఈ-సిటీని అభివృద్ధి చేయనున్నారు. తైవాన్కు చెందిన సిరా నెట్వర్క్స్ , తెలంగాణకు చెందిన ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ సంయుక్తంగా రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. దీని ద్వారా 2500 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమలో 5జీ నెట్వర్క్స్, ఇతర టెలికాం ఉత్పత్తులను తయారు చేస్తారు. . ఈ పెట్టుబడితో భారతదేశం, తైవాన్ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది.