హైదరాబాద్‌లో మసీదులకు మాస్కులు.. కారణమిదే

9 months ago 19
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర మార్గంలోని మసీదులను కవర్లతో కప్పివేశారు. అఫ్జల్‌గంజ్, చార్మినార్ ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టారు. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఒకేసారి రావడంతో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
Read Entire Article