హైదరాబాద్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర మార్గంలోని మసీదులను కవర్లతో కప్పివేశారు. అఫ్జల్గంజ్, చార్మినార్ ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టారు. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఒకేసారి రావడంతో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.