ఆర్మీ జవాన్ భార్య అనారోగ్యం పాలవడంతో అతడికి సెలవు దొరకలేదు. అయినా ఊరికి వచ్చి ఆమెకు శస్త్రచికిత్స చేయించాడు. విధులకు తిరిగి వెళ్తూ అతడ బంధువుకు ఫోన్ చేసి తన గురించి వెతకొద్దని చెప్పి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల కింద ఇది జరిగింది. శ్రీశైలం డ్యామ్ దగ్గర అతని కారు, ఫోన్ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సెలవు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడా అనే అనుమానాలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు.