భాగ్యనగరవాసులకు సోమవారం సాయంత్రం ఒక మధురమైన, అరుదైన అనుభూతి ఎదురైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం భారీగా కురిసింది. ముఖ్యంగా శంషాబాద్ - నాదర్గుల్ మధ్య ఔటర్ రింగ్ రోడ్డుపై వడగళ్లు మంచులా పేరుకుపోవడంతో ఆ ప్రాంతం యూరప్ను తలపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.