హైదరాబాద్ నగరంలోని రద్దీ కూడళ్లలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నానల్నగర్, రాడిసన్ కూడళ్లలో కొత్త ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ ప్రయోజనం చేకూరేలా డిజైన్లు రూపొందించారు. నానల్నగర్లో రూ.398 కోట్లతో రెండు ఫ్లైఓవర్లు నిర్మించి, వాటిని అనుసంధానం చేస్తారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించడమే కాకుండా.. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుంది.. వాహనాల కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.