ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో సిట్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కారుమూరి నివాసంలో సోదాలు నిర్వహించిన సిట్ బృందం.. అనంతరం మాజీ మంత్రి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. నాలుగు గంటలపాటు ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసింది. అనంతరం ఏప్రిల్ 30న విచారణకు రావాలని కారుమూరి తనయుడు సునీల్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.