హైదరాబాద్ నగరంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమైంది. పలువురు పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నారు. ఉగాది నాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి పత్రాలు ఇవ్వాలని భావిస్తున్నారు.