ఉస్మానియా ఆస్పత్రి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ హాస్పిటల్కు 115 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం రాజులు హైదరాబాద్ను పరిపాలించిన సమయంలో దీన్ని నిర్మించారు. అయితే భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన తర్వాత.. నిజాం రాజులు విదేశాలకు వెళ్లిపోయారు. అయితే అందులో కొందరు పాకిస్తాన్లోనూ స్థిరపడ్డారు. హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ వెళ్లిన వారి సంక్షేమం కోసం అక్కడ నిజాం రాజుల సహాయంతో ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్.. పాక్లోనూ ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించింది.