హైదరాబాద్ నగర వాహనదారులకు తీపి కబురు. త్వరలోనే రహ్మత్ నగర్ కూడలి ప్రాంతంలో ట్రాఫిక్ చిక్కులు తీరిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు జంక్షన్ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణ కోసం తీసుకోవాల్సిన ఆస్తుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే బాధితులకు పరిహారం ఇచ్చి పనులు ప్రారంభించాలని సర్కార్ భావిస్తోంది.