తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందులోనూ ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఉదయం 7 గంటలకే భానుడు భగభలలాడిపోతున్నాడు. ఈ క్రమంలో.. ప్రయాణాలు చేసేవాళ్లు సాధారణ బస్సుల్లో కాకుండా ఏసీ బస్సుల్లోనే ఆఫీసులకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ అధికారులు.. సేవలు పెంచటమే కాకుండా... అన్ని స్టాపుల్లో ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు.