హైదరాబాద్ నగరంలో పాదచారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ GHMC కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో 86 కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జిల (FOBs) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదే కాకుండా 500 కొత్త బస్ షెల్టర్లు కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతమున్న 23 FOBలను ప్రకటనలకు వాడుకోవడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ చర్యలు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, పాదచారుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తాయని అధికారులు భావిస్తున్నారు.