హైదరాబాద్లో పేదలు, రోజువారీ కూలీల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5కే టిఫిన్ పథకాన్ని నేడు ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ద్వారా నాణ్యమైన, పౌష్టికాహారాన్ని తక్కువ ధరకే అందించనున్నారు. జీహెచ్ఎంసీ, హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఇందిరమ్మ క్యాంటీన్లలో ఇది అందుబాటులోకి వచ్చింది. మొదట 60 ప్రాంతాల్లో ప్రారంభమై ఈ పథకం తర్వాత 150 క్యాంటీన్లకు విస్తరిస్తుంది. రోజుకు 25 వేల మందికి సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.