హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా శిల్పా లే ఔట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. జూన్ 28న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ ప్రారంభించనున్నారు. రూ. 178 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ గచ్చిబౌలి జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు.