హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్ దసర పండుగ నేపథ్యంలో భారీ శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. నగర వాసులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న రూ.5కే టిఫిన్ అందించే ఇందిరమ్మ క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖుర వరకు ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. దసరా పండుగ వేళ రూ.5కే టిఫిన్ అందించే ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వీటికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కానుంది.