హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అధికారులు కీలక సూచనలు చేశారు. తాగునీటిని ఎవరైనా వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జలమండలి అధికారులు.. తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలతో రూ.5 వేలు జరిమానా వేశారు. నీటిని వృథా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అధికారులు హెచ్చరికలు చేశారు.