హైదరాబాద్ నగర ప్రజలకు హెచ్చరిక. లింగంపల్లి నుంచి సనత్నగర్ రిజర్వాయర్కు వెళ్లే పైపులైన్ జంక్షన్ పనుల కారణంగా నేడు నగరంలోని కూకట్పల్లి, ఎస్సార్నగర్ డివిజన్లలో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. ప్రజలు నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.