హైదరాబాద్లో తరచూ విద్యుత్ అంతరాయాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. తొలుత ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి, భవిష్యత్తులో నగరం మొత్తం విస్తరించనున్నారు. దీని ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గించడంతో పాటు.. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఓఆర్ఆర్ వెంబడి సౌర విద్యుత్ ఉత్పత్తికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.