మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఒక్కోసారి ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. దీంతో తనను నమ్ముకొని ఉన్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. అందుకే మద్యం సేవించి వాహనం నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఇప్పటి వరకు రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన పోలీసులు.. ఇక నుంచి పగలు కూడా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.