కొత్త ఏడాది వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి.