ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా హైదరాబాద్ ట్యాంక్బండ్పై బీజేపీ తిరంగ యాత్ర నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే యాత్ర కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, అత్యవసరమైతే 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.