హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో హైలెవల్ బ్రిడ్జి, రేపే ప్రారంభం

1 hour ago 1
హైదరాబాద్‌ మూసారాంబాగ్‌ వద్ద మూసీ నదిపై నిర్మించిన హైలెవల్‌ బ్రిడ్జి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రూ.52 కోట్లతో 400 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ వంతెన అంబర్‌పేట–మూసారాంబాగ్‌ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. పాదచారుల కోసం 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేశారు. మూసీ వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం లేకుండా బ్రిడ్జిని నిర్మించారు. 2023లో నిలిచిపోయిన ప్రతిపాదనకు 2024లో మళ్లీ పనులు ప్రారంభమై.. తాజాగా నిర్మాణం పూర్తయింది.
Read Entire Article