హైదరాబాద్లో పార్కింగ్ కష్టాలు తీర్చేందుకు జీహెచ్ఎంసీ స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని ఖైరతాబాద్ జోన్లో ప్రవేశపెడుతోంది. ఈ విధానంలో మొబైల్ యాప్ ద్వారా పార్కింగ్ స్థలాల వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా నగరంలో రోడ్ల అభివృద్ధికి రూ.2,828 కోట్లతో సీఆర్ఎంపీ-2 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. చార్మినార్ వద్ద స్మార్ట్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు.