Hyderabad Vijayawada Flixbus New Bus Launch: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రోత్సహిస్తోందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ - విజయవాడ మధ్య ఈవీ బస్సులను ఈటీవో మోటార్స్తో కలిసి ఫ్లిక్స్ బస్సు ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. మంత్రి ఆ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. మూడు, నాలుగు వారాల తర్వాత హైదరాబాద్ - విజయవాడ మధ్య ఈవీ బస్సులు నడుస్తాయన్నారు. నాలుగు వారాల పాటు మధ్య రూ.99లకే ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు.