హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి త్వరలో 8 వరుసలకు విస్తరించనుంది. ప్రస్తుతం 'హైవే ఆఫ్ డెత్'గా మారిన ఈ మార్గంలో ప్రమాదాలను తగ్గించేందుకు బ్లాక్ స్పాట్లలో ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పనులు మొదలవుతాయి. ఈ విస్తరణతో తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా మెరుగుపడి, ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.