హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు NHAI వేగంగా చర్యలు చేపడుతోంది. 265 కిలోమీటర్ల మేర రూ.5,300 కోట్ల అంచనాతో మే నెలాఖరుకు డీపీఆర్ సిద్ధం కానుంది. గంతలోనే భూసేకరణ పూర్తి కాగా.. సాంకేతిక అధ్యయనం కోసం భోపాల్ సంస్థతో ఎన్హెచ్ఏఐ సంప్రదింపులు జరుపుతోంది. దండు మల్కాపూర్ నుండి ఏపీలోని గొల్లపూడి వరకు విస్తరణలో అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు.