హైదరాబాద్కు చెందిన సతీష్ అనే పర్వతారోహకుడు ఒంటరిగా దక్షిణ ధ్రువానికి సాహస యాత్ర చేసి, అక్కడ భారత జెండాను ఎగురవేసి రికార్డు సృష్టించాడు. మైనస్ 37 డిగ్రీల చలిలో 1133 కిలోమీటర్లు స్కీయింగ్ చేస్తూ, 126 కిలోల బరువుతో ప్రయాణించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. తన సేవలకు గుర్తింపుగా టెన్జింగ్ నార్గే అవార్డుకు సిఫారసు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరుతున్నాడు.