హైదరాబాద్లోని శాస్త్రవేత్తలు సంచలనం సృష్టించారు. కరువును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేశారు. ఈ జన్యు సవరణ వరి రకాలు 30 శాతం అధిక దిగుబడినిస్తాయి. పూసా రైస్ డీఎస్టీ1 కరువును, చౌడును తట్టుకుంటుంది. హైదరాబాద్, రాజేంద్రనగర్లోని ఐఐఆర్ఆర్ అభివృద్ధి చేసిన డీఆర్ఆర్ ధన్ 100 (కమల) అధిక దిగుబడినిస్తుంది. అంతేకాదు, ఇది 20 రోజులు ముందే కోతకు వస్తుంది. ఈ ఆవిష్కరణ అన్నదాతలకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.