హైదరాబాద్ వేగంగా విస్తరిస్తుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కోహెడ వద్ద దేశంలోనే నంబర్వన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ మార్కెట్ను 250 ఎకరాల్లో రూ.2890 కోట్లతో నిర్మిస్తారు. కోల్డ్ స్టోరేజ్లు, ఆధునిక షెడ్లు, సోలార్ రూఫ్ టాప్లతో రైతులకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తారు.