హైదరాబాద్ శివారు హయత్నగర్ లక్ష్మారెడ్డి పాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి మృతి చెందాడు. ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన అడిషనల్ డీసీపీ బాబ్జీని ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్-విజయవాడ హైవేను ఆయన దాటుతున్న క్రమంలో ప్రమాదం జరగ్గా.. స్పాట్లోనే బాబ్జీ కన్నుమూశారు. దీంతో పోలీస్ శాఖలో విషాదం అలుముకుంది.