హైదరాబాద్ నగర ప్రజలకు అధికారులు ముఖ్య హెచ్చరిక జారీ చేశారు. వచ్చే వారం అనగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నగరంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని తెలిపారు. గోదావరి ఫేజ్-1 పథకంలో మరమ్మత్తుల కారణంగా వచ్చే వారంలో 48 గంటల పాటు నీళ్లు రావని అధికారులు ప్రకటించారు. ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, గచ్చిబౌలితో పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. కనుక ప్రజలు పొదుపుగా నీటిని వాడుకోవాలని సూచించారు.