నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని ఒక హోటల్లో భారీ చోరీ జరిగింది. శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో, దుండగులు లాకర్లో ఉంచిన 60 లక్షల రూపాయలకు పైగా నగదును దోచుకెళ్లారు. హోటల్ వైష్ణవి గ్రాండ్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ఒకే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి. దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.